– కేంద్ర భద్రతా వైఫల్యంతోనే బాలాకోట్, పుల్వామా, పహల్గాం దాడులు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉగ్రవాదులను అరికట్టడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భద్రతా వైఫల్యం కారణంగానే 2016లో బాలాకోట్, 2019లో పుల్వామా, ఇటీవల పహల్గాంలో దాడులు జరిగాయని చెప్పారు. సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కమలానగర్లోని పార్టీ జిల్లా కార్యాయలంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శ్రీనివాసులు అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడారు. పహల్గాంలో పర్యాటకుల మీద ఉగ్రవాదులు దాడిచేసి 26మంది పర్యాటకులను చంపేయ డానికి కారణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భద్రతా వైఫల్యమే నని అన్నారు. ఉగ్రవాదులు దాడి చేస్తున్నప్పుడు అక్కడ గుర్రం నడిపే ఓ ముస్లిం, పర్యాటకులను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడని, ఈ ఉగ్రదాడిని యావత్ భారతదేశంతోపాటు జమ్మూ కశ్మీర్ ప్రజలు సైతం తీవ్రంగా ఖండించారని తెలిపారు. పహల్గాం దాడిలో పేరు, మతం అడిగి చంపేశారని అన్నారని, సీపీఐ(ఎం) నాయకత్వం కశ్మీర్లో పర్యటించి, గుర్రం నడిపే ముస్లిం యువకుడి ఇంటికెళ్లి వారి తండ్రిని పరామర్శించినప్పుడు ఉగ్రవాదులు దాడి చేసింది పర్యాటకుల మీద కాదు, కశ్మీరుల గుండెల్లో కాల్చారని చెప్పినట్టు తెలిపారు. ఒక ముస్లిం యువకుడు ఆ దాడిలో బీజేపీ నాయకుని కూతురు ను రక్షించాడనీ, తర్వాత ఆమె తనకు కశ్మీర్లో ఇద్దరు అన్నయ్యలు దొరికార నని చెప్పినట్టు చెప్పారు. కేంద్రం ఇప్పటి వరకు పహల్గాం లో దాడి చేసిన ఉగ్రవాదుల్ని పట్టుకోలేకపోయిందని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద కేంద్రాల మీద దాడి చేసి చంపేశారనీ, పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులను ఏరి పారేసామని అన్నారని గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు ఉగ్రవాదులకు అందుబాటులో లేకుండా చేయటమేనని చెప్పారన్నారు. ఆర్టికల్ 357 రద్దు కూడా ఉగ్రవాదుల్ని అంతం చేయడాని కేనని చెప్పారని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదుల్లేకుండా చేశామని మోడీ, అమిత్ షా ప్రకటించిన 10 రోజులకే అక్కడ ఉగ్రదాడి జరిగిందన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పర్యాటకులను అక్కడి టాక్సీ వాలాలు ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేర్చితే, విమాన యాన సంస్థ మాత్రం అధిక రేట్లు పెంచి పర్యాటకులను దోచుకుం దని చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాన్ని పాకి స్తాన్ కూల్చేసిందని ద వైర్ పత్రిక భారత ప్రజానీకానికి తెలి పితే, ఆ పత్రికను బ్యాన్ చేశారని అన్నారు. కాల్పుల విర మణను పాకిస్తాన్ గానీ, భారత్గానీ ప్రకటించలేదనీ, అమె రికా అధ్యక్షులు ట్రంప్ ప్రకటించారని చెప్పారు. దీనికి అర్థం సామ్రాజ్యవాద దేశమైన అమెరికా.. మన దేశ అంత ర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని అన్నారు. ట్రంప్ జోక్యం చేసుకుంటే మోడీ ఇప్పటివరకు తమ దేశం గురించి నీకెందుకు..? నీకేం సంబంధం..? అని అడగలే దన్నారు. ఇంత జరిగినా ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ మన దేశం వద్దని చెప్పినా.. పెద్దఎత్తున పాకిస్తాన్కు ఆర్థిక సాయం చేసిందని తెలిపారు. చిన్నదేశం ఇరాన్ అమెరికాను భయ పెడితే, మన దేశం మాత్రం అమెరికాకు సలాం కొడుతున్న దన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం జమ్మూకశ్మీర్ ప్రజలకు భద్రతా విషయంలో అండగా ఉంటామని హామీ నివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పి.సత్యం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శ్రీనివాసులు, కోమటి రవి, ఎ.అశోక్, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రవాదులను అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES