- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఉపరితల ఆవర్తనం కారణంగా మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం నిజామాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం పడే అవకాశముందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
- Advertisement -