- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- Advertisement -