లక్షెట్టిపేట-లక్షెట్టిపేట
రిజర్వేషన్ పితామహుడు ఛత్రపతి మహారాజ్ మొట్టమొదటి సారి సమానత్వంతో కూడిన పాలన అందించాడని అలిండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్ కొల్లూరి రవి కుమార్ పేర్కొన్నారు. అలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రిజర్వేషన్ డే సందర్బంగా వాగేశ్వర జూనియర్ కాలేజీలో పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్కు ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశానికి అన్ని వర్గాల్లో రాజకీయ, ఆర్థిక, సామజిక రంగాల్లో సమానత్వం నేర్పిన మహనీయుడని, అయన చేసిన సేవలను కొనియాడారు. ఛత్రపతి సాహు మహారాజ్ కొల్లాపూర్ సంస్థాన రాజ్య పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ వర్గాలకు మొట్టమొదట రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మహనీయుడన్నారు. ఆ కాలంలో మహిళలకు చదువుని ఉచిత నిర్భంద విద్య, బాల్య వివాహలను రద్దు చేస్తూ, వితంతు పునర్వివాహలను చట్ట బద్దము చేశాడన్నారు. సాహు మహారాజ్ను అంబేద్కర్ ఆదర్శంగా తీసుకోని ఆలోచన, ఆశయ లక్షాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా గిరిజన విద్యార్థి సంఘం జాతీయధ్యక్షుడు ఇందల్ రాథోడ్, అల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల నాయకుడు దర్శనాల నవీన్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం పట్టణధ్యక్షు విక్రమ్, మంచాల కుమార్, యూత్ నాయకుడు అయిల్ల ప్రశాంత్, వినరు పాల్గొన్నారు.
మంచిర్యాల : ఛత్రపతి సాహు మహారాజ్ అందించిన రిజర్వేషన్ల రక్షణ తో పాటు సమగ్ర సామాజిక న్యాయ సాధన కోసం దేశంలోని బహు జనులందరు ఐక్యంగా ఉద్యమించాలని వివిధ సామాజిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాలలోని చార్వాక ట్రస్ట్ హాల్లో జరిగిన 122వ రిజర్వేషన్ డే సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఛత్రపతి సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి డూర్కె మోహన్, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, సమతా సైనిక్ దళ్ పాల్గొన్నారు.