న్యూఢిల్లీ: ఒప్పో మొబైల్స్ కొత్తగా బడ్జెట్ ధరలో కొత్త ఒప్పో కె12ఎక్స్ 5జిను సోమవారం విడుదల చేసింది. 6జి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.12,999గా నిర్ణయించింది. 8జిబి, 256 వేరియంట్ ధరను రూ.15,999గా ప్రకటించింది. ఆగస్టు 2వ తేది నుంచి ఆన్లైన్లో ఈ మొబైల్ ఫోన్ లభ్యమవుతుందని తెలిపింది. 32ఎంపి పిక్సెల్ సెన్సార్ మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా, సెల్ఫీ కోసం 8 ఎంపి కెమెరాతో దీన్ని అందుబాటులోకి తెస్తోంది.