Friday, July 4, 2025
E-PAPER
Homeసినిమానిగ్గదీసి ప్రశ్నించే 'ఇదేమీ రాజ్యం..' పాట

నిగ్గదీసి ప్రశ్నించే ‘ఇదేమీ రాజ్యం..’ పాట

- Advertisement -

‘పోలీస్‌ వారి హెచ్చరిక’ సినిమా లోని సామాజిక చైతన్య గీతాన్ని రచయిత పరుచూరి గోపాల కష్ణ ఆవిష్కరించారు. దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తూలికా తనిష్క్‌ క్రియేషన్స్‌ పతాకంపై బెల్లి జనార్థన్‌ నిర్మించారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాల కష్ణ మాట్లాడుతూ, ‘చాలా రోజుల తరువాత వెండితెర పైన మళ్ళీ ఇటువంటి అభ్యుదయ గీతాన్ని చూస్తున్నాను ఈ పాటలో ఉన్న గమ్మత్తు వైవిధ్యం ఏమిటంటే ఇది ఏ పార్టీనో ఏ సిద్ధాంతాన్నో ప్రచారం చేసే పాట కాదు. ఈ సినిమా కథ ప్రస్తావిస్తున్న ఒకానొక ఘోరాన్ని నిగ్గదీసి ప్రశ్నించే పాట’ అని అన్నారు.
‘తెలుగు సినీ పరిశ్రమలో భుజం మీద ఎర్ర శాలువాను కప్పుకొని తిరుగుతున్న అభ్యుదయ అక్షరం పరుచూరి గోపాలకష్ణ చేతుల మీదుగా ఈ ప్రశ్నించే పాట ఆవిష్కరించబడటం మా యూనిట్‌ మొత్తానికి సంతోషాన్ని కలిగించింది’ అని దర్శకుడు బాబ్జీ చెప్పారు. నిర్మాత బెల్లి జనార్థన్‌ మాట్లాడుతూ, ”సినీ పెద్దలందరి ఆశీస్సులతో మా సినిమాను ఈనెల మూడవ వారంలో విడుదల చేస్తున్నాం. సమాజంలోని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే పక్కా కమర్షియల్‌ సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందించాము’ అని అన్నారు. హీరో సన్నీ అఖిల్‌ మాట్లాడుతూ, ‘నేను హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం రెగ్యులర్‌ పంథాలో, అందమైన కాస్ట్యూమ్స్‌ వేసుకుని, ప్రేమ గీతాలు పాడుకుంటూ హీరోయిన్‌ వెంట తిరిగే పాత్రను కాకుండా సీనియర్‌ నటులు మాత్రమే పోషించే యాక్టింగ్‌ సత్తాను చాటుకోవడానికి అవకాశమున్న పాత్రను పోషించే అవకాశం లభించడం అదష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -