- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కేసీఆర్… ఆరోగ్యం మెరుగుపడింది. సీజనల్ వ్యాధితో బాధపడ్డ కేసీఆర్ యశోద ఆస్పత్రిలో రెండు రోజుల కిందట అడ్మిట్ అయ్యారు.
అనంతరం.. వైద్యుల సమక్షంలోనే చికిత్స పొందారు. ఇక ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో ఇవాళ.. డిశ్చార్జ్ అయ్యారు . కేసీఆర్ వెంట హరీష్ రావు అలాగే సంతోష్ కూడా ఉన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ నేరుగా ఎర్రవెల్లికి కేసీఆర్ వెళ్తున్నట్టు తెలుస్తోంది.
- Advertisement -