
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూటుమెంటు బోర్డు నిర్వహిస్తున్న సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియా కార్యక్రమం ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్., ఆదేశాల మేరకు అదనపు డి.సి.పి (ఎ.ఆర్) గిరిరాజు ఆద్వర్యంలో గురువారం ఉదయం 8 గంటల నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు సర్టిఫికేటు వెరిఫికేషన్ ప్రక్రియా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అభ్యర్ధులు తమ సర్టిఫికేట్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది.ఎనిమిదవ రోజుకు 616 మంది అభ్యర్ధులను పిలవగా అందులో 562 మంది అభ్యర్ధులు హజరుకాగ వారి ద్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా పరిపాలన అధికారి ( ఎ.ఓ) బి. శ్రీనివాస్, ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్ మక్సూద్ హైమద్ గోవింద్ సి.పి.ఓ కార్యాలయం సిబ్బంది, రిజర్వు విభాగం సిబ్బంది ఐ.టి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.