- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాకు చెందిన డాక్టర్ రాజీవ్ను టీపీసీసీ డాక్టర్స్ కమిటీ చైర్మెన్గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఆయన ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చాతీవైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈమేరకు శనివారం పార్టీ అధ్యక్షులు మహేశ్కుమార్గౌడ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనను నియమించినందుకు ఆయన అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -