Monday, July 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేసు నమోదు

తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేసు నమోదు

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ముందుగా కవిత ప్రోద్బలంతోనే ఆమె అనుచరులు, కార్యకర్తలు తన కార్యాలయంపై, తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు తీన్మార్ మల్లన్న చేశారు. సుమారు 50 మంది కవిత అనుచరులు మారణాయుధాలతో తనపై దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారని మల్లన్న ఫిర్యాదు చేశారు. బీసీ ఉద్యమ నాయకులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు కవితపై బీఎన్ఎస్ సెక్షన్లు 191(2), 191(3), 333,109, 324(4), 351(3), 132, 190, 49 ప్రకారం కేసులు నమోదు చేశారు. మరో వైపు మరోవైపు తీన్మార్‌ మల్లన్న అనుచరులు, భద్రతా సిబ్బంది తమపై కత్తులు, తుపాకులతో దాడి చేశారంటూ జాగృతి కార్యకర్త లింగమయ్య అలియాస్‌ అశోక్‌ యాదవ్‌ ఫిర్యాదు మేరకు తీన్మార్‌ మల్లన్న, అతని అనుచరులపై 191(2), 191(3), 76, 127(2), 109, 351(3),రె/విత్‌ 149 ఐపీసీ సెక్షన్‌ 25, 27 యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -