Monday, July 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆఫ్రికా దేశం మాలిలో మిర్యాలగూడ వాసి కిడ్నాప్

ఆఫ్రికా దేశం మాలిలో మిర్యాలగూడ వాసి కిడ్నాప్

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌ పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఉగ్రవాదులు ముగ్గురు భారతీయులను అపహరించారు. ఈ నెల 1న కేయస్ రీజియన్ లోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చిన ఉగ్రవాదులు.. అక్కడ పనిచేస్తున్న భారతీయులను బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని తుపాకులతో బెదిరించారు. ఆల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమాన్ (జేఎన్ఐఎం) ఉగ్రవాదులే ఈ కిడ్నాప్ చేసినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. కిడ్నాప్ కు గురైన వారిని తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన అమరలింగేశ్వర రావు(45) తో పాటు రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన ప్రకాశ్ చంద్ జోషి, ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన పి.వెంకటరామన్ గా అధికారులు గుర్తించారు. ఈ కిడ్నాప్ ఘటనపై మాలి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, కిడ్నాపర్ల చెర నుంచి వారిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -