హౌంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహ’. దీనికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. శిల్పా ధావన్, కుశాల్ దేశారు, చైతన్య దేశారు నిర్మించారు. ఈ చిత్రం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈనెల 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్గా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అశ్విన్ కుమార్ ఆదివారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. శ్రీమహావిష్ణువు దశావతారాలన్నీ లార్జర్ దేన్ లైఫ్, బిగ్ కాన్వాస్లో ప్రజెంట్ చేయాలనే ఆలోచనతో ఈ మహావతార్ యూనివర్స్ మొదలైంది.
యానిమేషన్లోనే ఈ సినిమాని నిర్మించాలనే ఆలోచన మొదటి నుంచి ఉంది. శ్రీమహావిష్ణువు కథని చెప్పాలంటే యానిమేషన్ అనేది ఒక బెస్ట్ మీడియం. కొన్నిసార్లు నటులు దేవుని పాత్రలు చేసేటప్పుడు చాలా ఛాలెం జింగ్గా ఉంటుంది. అప్పటివరకు చేసిన సినిమాల ఇమేజ్ ఈ క్యారెక్టర్ మీద పడుతుంది. అందుకే ఎపిక్ కథల్ని చెప్పడానికి యానిమేషన్ బెస్ట్ మీడియం అని భావించాం.
శ్రీ విష్ణువుకి సంబంధించి పతి అవతారానికి ఒక విశిష్టత ఉంది. నరసింహ అవతారం నేటి సమాజానికి ముఖ్యంగా యువతకి చాలా అవసరం. నరసింహ స్వామి రక్షకుడు. ప్రస్తుత పరిస్థితులకిి నరసింహస్వామి అవతారం ప్రేక్షకుల్లో ఒక కొత్త నూతన ఉత్తేజాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను.
ఇది మైథాలజీ కాదు. ఇది మన చరిత్ర. ప్రతి జనరేషన్కి మన చరిత్రని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పిల్లలకి, ఈ జనరేషన్ యువతకి మన చరిత్ర తెలియజేయాలి. ఈ సినిమా చేస్తున్నప్పుడు మేము అహౌబిలం వెళ్ళాము. ఆయన ఆశీర్వాదం ఈ సినిమాపై ఉంది. ఇది శాస్త్రాలను నుంచి తీసుకున్న కథ.
హౌంబాలే ఫిల్మ్స్తో కలిసి ఈ ప్రాజెక్టు చేయడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. వారు ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేశారు. వారికి సినిమా చాలా నచ్చింది. మమ్మల్ని ఎంతో అద్భుతంగా గైడ్ చేశారు.
శ్యామ్ సియస్ అద్భుతమైన మ్యూజిక్ని కంపోజ్ చేశారు. ఇంటర్నేషనల్ స్థాయిల్లో ఆర్కెస్ట్రా కంపోజ్ చేశారు. చాలా అద్భుతమైన మ్యూజిషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. పవర్ఫుల్ డివైన్ఫుల్ మ్యూజిక్ని క్రియేట్ చేశారు. సినిమా చూస్తున్నప్పుడు మ్యూజిక్ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే విజువల్ వండర్గానూ ఉంటుంది.
విజువల్ వండర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES