వెంకటేశ్వర స్వామీ మఠంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

MLA who performed special pooja at Venkateswara Swamy Mathనవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం నీమానాయక్ తండాలో వెంకటేశ్వర స్వామి మఠంలో శనివారం నాగార్జున సాగర్ ఎంఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి హాలియా మార్కెట్ చైర్మెన్ తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఎంఎల్ ఏ జయవీర్ రెడ్డి మాట్లాడుతూ..  ప్రజలందరు పాడి పంటలతో ఉండాలని కోరు కున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి, సాగర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పగడాల నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు చల్ల హన్మంతురెడ్డి, రమావత్ సీతారాం నాయక్, రమావత్ నాగేశ్వర్ రావు, రమావత్ బాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love