నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాలను నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇప్పటివరకు మార్కౌట్ ఇవ్వని లబ్ధిదారులు త్వరగా మార్కౌట్ చేయించుకోవాలన్నారు.
ఇప్పటికే మార్కౌట్ పూర్తయిన లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణం పనులు చేపట్టాలని సూచించారు. లబ్ధిదారులు వేగంగా ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించుకొని త్వరగా బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేసుకోవాలన్నారు. ఇండ్ల నిర్మాణంలో మాత్రం ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా లబ్ధిదారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుంది అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగాజమున, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, పట్టణ అధ్యక్షులు గణేష్ గౌడ్, నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES