Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుగేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌

గేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌

- Advertisement -

– గాంధీ సరోవర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌పై నిర్మాణం
– బహుళ ప్రయోజనాలతో మూసీ పునరుజ్జీవం : సీఎం రేవంత్‌ ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
: హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ సిటీ ఏరియాలో చేపట్టే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌ను బహుళ ప్రయోజనాలుండేలా అత్యంత అధునాతనంగా నిర్మించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను అదేశించారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హైదరాబాద్‌ ముఖద్వారం గా హిమాయత్‌సాగర్‌ గాంధీ సరోవర్‌ దగ్గర ఓఆర్‌ఆర్‌పై ‘గేట్‌ వే అఫ్‌ హైదరాబాద్‌’ నిర్మించాలని సూచించారు. ఓఆర్‌ఆర్‌కు ఒక వైపున ఎకో థీమ్‌ పార్క్‌ అభివద్ధి చేసి మరోవైపున బాపూఘాట్‌ వైపు భారీ ఐకానిక్‌ టవర్‌ నిర్మించాలని చెప్పారు. అందుకు తగినవిధంగా డిజైన్లు రూపొందించాలని సీఎం అదేశించారు. ఓఆర్‌ఆర్‌కు ఒక వైపున ఉండే ఎకో థీమ్‌ పార్క్‌.. మరో వైపున నిర్మించే ఐకానిక్‌ టవర్‌కు చేరుకునేందుకు ప్రయాణా లకు వీలుగా ఎలివేటెడ్‌ గేట్‌ వే నిర్మించి దాన్ని ‘గేట్‌ వే అఫ్‌ హైదరాబాద’్‌గా డిజైన్‌ చేయాలని సూచించారు. బాపూఘాట్‌ చుట్టూ ఉన్న ఏరియాను వరల్డ్‌ క్లాస్‌జోన్‌గా అందరిని ఆకట్టుకునేలా డిజైన్‌ చేయాలని చెప్పారు. హిమాయత్‌సాగర్‌ దగ్గర అప్రోచ్‌ రోడ్డు నుంచి అత్తాపూర్‌వైపు వెళ్లేందుకు కొత్త ప్లైఓవర్‌ నిర్మించాలనీ, గాంధీ సరోవర్‌ చుట్టూ ఈ ప్లైఓవర్‌ కనెక్టివ్‌ కారిడార్‌లా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా గాంధీ సరోవర్‌కు చేరుకునేలా ఈ కనెక్టివిటీ ఉండాలన్నారు. గాంధీ సరోవర్‌ వద్ద నిర్మించే ఐకానిక్‌ టవర్‌ పరిస్థితులను బట్టి ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా నిర్మించాలని చెప్పారు.
తాగునీటితోపాటు..
తాగునీటితోపాటు వరదనీటి నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌ ఉండాలనీ, వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ప్రాజెక్ట్‌ నమూనాలు పరిశీలించాలని సీఎం చెప్పారు. ఉస్మాన్‌సాగర్‌ హిమాయత్‌సాగర్‌ తాగునీటిని హైదరాబాద్‌ నగర అవసరాలు తీర్చేందుకు మరింత సమర్ధంగా వినియోగించుకునేలా ప్లానింగ్‌ చేయాలన్నారు. స్థలం వథా కాకుండా మూసీ పరివాహక ప్రాంతం ఇరువైపులా అండర్‌గ్రౌండ్‌లో భారీగా వాటర్‌ స్టోరేజీ సంపు నిర్మించే సదుపాయాలు, అక్కడి నుంచి వాటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ జరిగేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గాంధీసరోవర్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివద్ధి చేసే పనులకు వాటర్‌ఫ్లో స్టడీస్‌ పక్కాగా చేసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల వేగం పెంచాలని ముఖ్యమంత్రి అధికారులను అదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img