Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుచందానగర్‌లోని ఖజానా జ్యువెల్లరీ దుకాణంలో కాల్పుల కలకలం

చందానగర్‌లోని ఖజానా జ్యువెల్లరీ దుకాణంలో కాల్పుల కలకలం

- Advertisement -

నవ‌తెలంగాణ -హైద‌రాబాద్ : చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెల్లరీ దుకాణంలో దుండగులు దోపిడీకి యత్నించారు. చందానగర్ మెయిన్ రోడ్డుపై ఉండే ఖజానా జ్యువెలర్స్ బంగారం షోరూంలో దోపిడీకి దొంగలు ప్లాన్ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో.. ఖజానా జ్యువెలర్స్ షాపు ఓపెన్ చేసిన వెంటనే.. ఆరుగురు దోపిడీ దొంగలు తుపాకులతో షోరూంలోకి ఎంట్రీ ఇచ్చారు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్స్, సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ పూర్తి వివరాల్లోకి వెళితే.. చందానగర్ మెయిన్ రోడ్డుపై ఖజానా జ్యువెలర్స్ బంగారం షోరూం ఉంటుంది. ఈ షోరూంలోకి ఆరుగురు సభ్యుల ముఠా వచ్చింది. ముఖానికి మాస్కులు పెట్టుకున్నారు. వాళ్ల చేతుల్లో తుపాకులు ఉన్నాయి. షోరూంలోకి వచ్చీరాగానే.. బంగారం భద్రపరిచే లాకర్ కీ ఇవ్వాలంటూ బెదిరించారు. విషయం అర్థం అయిన వెంటనే సెక్యూరిటీ గార్డ్స్, షోరూంలోని సిబ్బంది అడ్డుకున్నారు. లాకర్ కీ ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. లాకర్ కీ ఇవ్వకపోవటంతో.. షోరూం అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు జరిపారు. తూటా గాయానికి అతను తీవ్రంగా గాయపడ్డాడు. షోరూంలో డిస్ ప్లే అద్దాలను ధ్వంసం చేశారు దొంగలు. షోరూంకి దోపిడీ దొంగలు వచ్చారన్న సమాచారం పోలీసులు ఫోన్ ద్వారా చెప్పారు సెక్యూరిటీ సిబ్బంది. ఆ వెంటనే పోలీసులు వాహనాలు ఖాజానా షోరూంకు వచ్చాయి. పోలీసులు వస్తున్నారన్న సమాచారం రావటంతో.. అక్కడి నుంచి పారిపోయారు ఆ ఆరుగురు దోపిడీ దొంగలు.

షోరూంకు వచ్చిన పోలీసులు స్పాట్ మొత్తాన్ని పరిశీలించారు. వెంటనే దోపిడీ దొంగలను పట్టుకునేందుకు 10 టీమ్స్ ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దులను అలెర్ట్ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. నిందితుల కోసం పది బృందాలను ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. దోపిడీకి వచ్చిన దొంగలు రాష్ట్రానికి చెందిన వాళ్లా లేక అంతరాష్ట్ర ముఠానా అనే విషయాన్ని తేల్చేందుకు.. షోరూంలో వేలి ముద్రలు, ఇతర ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img