Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఫ్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాలలోనే నిర్వహించాలి..

ఫ్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాలలోనే నిర్వహించాలి..

- Advertisement -

– పోషన్ ట్రాకర్ యప్ లో ఫేస్ క్యాప్చర్ ( ఎఫ్ ఆర్ ఎస్ ) విధానాన్ని రద్దు చేయాలి
– కలెక్టరేట్ ధర్నాలో పాల్గొన్న  కందూరి చంద్రశేఖర్
నవతెలంగాణ – కామారెడ్డి

తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వందలాది మంది అంగన్వాడి టీచర్ ఆయాలతో  ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ ఐసిడిఎస్ ని బలపేతం చేయాలంటే ప్రీ ప్రైమరీ స్కూలు పిఎం శ్రీవిద్యను అంగన్వాడి సెంటర్ లోనే  కొనసాగించాలని, విద్య బోధన బాధ్యతను అంగన్వాడి టీచర్లకు, హెల్పర్లకు ఇవ్వాలని, విద్య వాలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని అదనంగా అంగన్వాడి టీచర్లకు ఇవ్వాలిని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం  ఐసిడిఎస్ తోపాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడి రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది, దీని అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే పూనుకుంటుందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిని వ్యతిరేకించి అంగన్వాడి సెంటర్ లోనే ప్రి ప్రైమరీ స్కూలు పీఎం శ్రీ విద్యను అమలు జరిగేటట్టు చూడాలని వారు కోరారు. ఆరు సంవత్సరాల పిల్లలలో చదువుతోపాటు ఆటలు పాటలు  శారీరక ఎదుగుదల ఉండాలి కాబట్టి ఆ పద్ధతిలో పోషక ఆహారం అంగన్వాడి సెంటర్ లో  సప్లై ఉంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడి సెంటర్ల అభివృద్ధి కొరకు కృషి వారు అన్నారు.

దీనివల్ల ఇచ్చిన టార్గెట్ పూర్తి కాక సూపర్వైజర్లు, సిడిపిఓలు మెమోలు ఇస్తామని పేరుతో ఒత్తిడి తెస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఫేస్ క్యాప్చర్  విధానాన్ని రద్దు చేయాలని  డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన ప్రతి స్కీములను అంగన్వాడీ టీచర్ల కే అప్పజెప్పుతో పనివారాన్ని పెంచుతున్నారని అందులో భాగంగానే డిఎల్ఓ డ్యూటీలను అంగన్వాడి టీచర్లకు మినహాయించాలని  ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా అంగన్వాడి టీచర్లకు రిపోర్టింగ్ డిజిటలైజేషన్ సిస్టం అమలుకు ముందు అన్ని కేంద్రాల్లో కంప్యూటర్లు గాని లాప్టాప్ లు గాని 5 జి నెట్వర్క్ తో కూడిన మొబైల్స్ ను ఇవ్వాలని  కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బుధవారం అరుణ్ కుమార్, నర్సింలు, అంగన్వాడి యూనియన్ జిల్లా నాయకులు బాబాయ్ లక్ష్మి, సవిత, కవిత, సునంద, సిద్దేశ్వరి, సుజాత, యాదమ్మ,  రాణి, లక్ష్మి, ఇందిరా, అలివేలు, స్వరూప, సురేఖ, దేవకర్ణ, సుజాత, పద్మ ,హసీనా, స్రవంతి,  శోభ, వజ్ర, రాజేశ్వరి, విజయ, రాజలక్ష్మి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad