- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆర్డీవో జనార్ధన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు, కంప్యూటర్లలో భూముల వివరాలను పరిశీలించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని ఇటీవల గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సునీత, డిటీ విద్యాధరి, ఆర్ఐ భరత్, సీనియర్ అసిస్టెంట్ తదితరులు ఉన్నారు.
- Advertisement -