నవతెలంగాణ-హైదరాబాద్: వరకట్న వేధింపులకు ఓ లెక్చరర్ మరణించింది.ఈ ఘోర విషాద ఘటన రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. సంజు బిష్ణోయ్ అనే మహిళ జోధ్పూర్ జిల్లాలో లెక్చరర్గా పని చేస్తోంది. అయితే ఇంట్లో నిత్యం భర్త, అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారు. ఈ వేధింపులు రోజురోజుకు మరింత తీవ్రం కావడంతో విసుగెత్తిపోయింది. దీంతో మూడేళ్ల కుమార్తె యశస్వితో కలిసి పెట్రోల్ పోసుకుని సజీవదహనం అయ్యారు. ఘటనాస్థలిలోనే కుమార్తె ప్రాణాలు వదలగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంజు శనివారం మృతిచెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది.
జోధ్పూర్ జిల్లాలోని ఫిట్కాస్ని గ్రామానికి చెందిన బాధిత మహిళా తల్లిదండ్రులు.. అల్లుడు దిలీప్ బిష్ణోయ్, అతని తల్లి, తండ్రిపై ఫిర్యాదు చేశారు. వారి వేధింపులు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దీంతో భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) బృందం సహాయంతో పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో భర్త, అత్తగారు, మామగారు, వదిన వేధించారని ఆరోపించింది. గణపత్ సింగ్ అనే వ్యక్తిపై కూడా వేధింపుల ఆరోపణలు చేసింది. గణపత్ సింగ్తో కలిసి మహిళను భర్త శారీరకంగా వేధించినట్లు గుర్తించారు.