- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వసూళ్లకు పాల్పడిన రికార్డు అసిస్టెంట్ ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు మంగళవారం సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. మోత్కూరు తహశీల్దార్ కార్యాలయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న రికార్డు అసిస్టెంట్ చరణ్ రాజ్ కలెక్టర్ హనుమంతరావు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్డీవో మండల కార్యాలయాన్ని సందర్శించి, బాధితుల వాంగ్మూలాలు సేకరించారు. పూర్తి నివేదికను కలెక్టర్ సమర్పించారు. ఆ నివేదిక పరిశీలన అనంతరం చరణ్ రాజ్ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారించి ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
- Advertisement -