హైదరాబాద్ తర్వాత రెండవ జిల్లాగా ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతల్లో ట్రాన్స్జెండర్
నవతెలంగాణ- జగిత్యాల టౌన్
జగిత్యాల జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జనోత్సవం బందోబస్తు లో ట్రాన్స్జెండర్ల చే ట్రాఫిక్ నియంత్రణ చేపట్టడం జరిగింది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమైన ప్రజా సేవా కార్యక్రమ బాధ్యతల్లో ట్రాన్స్జెండర్లను చేర్చిన రెండవ జిల్లా జగిత్యాలగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జన బందోబస్తులో ట్రాన్స్జెండర్లను భాగస్వామ్యం చేయడం వల్ల సమాజంలో ప్రతి వర్గానికీ గౌరవం, మర్యాద, సమానత్వం అందించే మంచి సందేశం వెళ్తుందని పేర్కొన్నారు. తమదైన జీవనశైలిలో ఉండే వీరికి సమాజంలో వివక్షను పోగొట్టడానికి ట్రాఫిక్ వీధుల్లోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో 11 మంది ట్రాంజెండర్లు ట్రాఫిక్ విదులు నిర్వహించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఇలాంటి బాధ్యతల్లో ట్రాన్స్జెండర్లను చేర్చిన రెండవ జిల్లా జగిత్యాలగా నిలిచిందని అన్నారు.
గణేశ్ నిమజ్జన ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్జెండర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES