Tuesday, September 15, 2026
E-PAPER
Homeఆటలుకాంస్య పోరుకు మహిళల జట్టు

కాంస్య పోరుకు మహిళల జట్టు

- Advertisement -

ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌

గాంజ్జూ (దక్షిణ కొరియా) : ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత అమ్మాయిల పతక వేట కొనసాగుతుంది. రికర్వ్‌ మహిళల జట్టు విభాగంలో దీపిక కుమారి, ఖడకె, అంకిత త్రయం కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. స్లోవేనియా, టర్కీపై విజయాలు సాధించి సెమీఫైనల్లో ప్రవేశించిన అమ్మాయిలు.. ఫైనల్‌ దారిలో తడబాటుకు గురయ్యారు. జపాన్‌ చేతిలో 2-6తో ఓటమి చెందారు. నేడు జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో దీపిక త్రయం పోటీపడనుంది. మెన్స్‌ రికర్వ్‌ జట్టు (ధీరజ్‌, రాహుల్‌, నీరజ్‌) తొలి రౌండ్లోనే డెన్మార్క్‌ చేతిలో అనూహ్య ఓటమి చవిచూశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -