రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘6 జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్పై బసీర్ ఆలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 9న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు బసీర్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ఇది వరకు తెలుగులో ‘సమరం’, కన్నడలో మరో చిత్రాన్ని చేశాను. నా మూడో సినిమాగా ‘6 జర్నీ’తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. ఇది ఆరుగురి జీవిత ప్రయాణం. గోవా ట్రిప్ను ఎంజారు చేసి సూసైడ్ చేసుకోవాలని అనుకునే ఓ బ్యాచ్ కథే ఈ సినిమా. అలాంటి వారి ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అనేది ఆద్యంతం ఆసక్తికరం. సమీర్, పల్లవి జంట అద్భుతంగా నటించింది. కొత్త అబ్బాయి అభిరాం విలన్గా చక్కగా నటించారు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త ఫైట్ మాస్టర్ అందరూ అద్భుతంగా పని చేశారు.
నిర్మాతది మా ఊరే. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఈ కథ ఆయనకు నచ్చడంతో ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది.మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎన్ సింహా మంచి పాటల్ని ఇచ్చారు. మంచి సంగీతం, మంచి పాటలు ఉన్నాయి. ఆల్రెడీ మా పాటలు యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నాయి.
మంచి కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ చాలా గొప్పగా ఉంటుంది. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా క్లైమాక్స్ను అద్భుతంగా తెరకెక్కించాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా పూర్తిగా టెర్రరిజం మీదే నడుస్తుంది. అక్టోబర్లో మరో సినిమా చేయబోతోన్నాను. ముంబై బ్యాక్డ్రాప్లో ఆ చిత్రం ఉంటుంది.
దేశభక్తిని రేకెత్తించేలా క్లైమాక్స్
- Advertisement -
- Advertisement -