పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’. ఇటీవల పవన్కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుంచి ‘ఓమి’ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. తాజాగా చిత్ర బృందం ‘ఓమి ట్రాన్స్’ తాలూకా పూర్తి వెర్షన్ను విడుదల చేసింది. దీని గురించి చిత్ర బృందం స్పందిస్తూ,”ఓజీ’, ‘ఓమి’ల ముఖాముఖి పోరుని సూచించేలా ఈ గీతం ఉంది. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్, ఓమిగా ఇమ్రాన్ హష్మి మధ్య భీకర పోరాటం అద్భుతంగా ఉంటుంది. ఉరుములు, మెరుపులను తలపించే బీట్స్తో సంగీత సంచలనం తమన్ ఎస్ స్వరపరిచిన ‘ఓమి ట్రాన్స్’ ఎంతో శక్తివంతంగా ఉండి, నిజంగానే శ్రోతలను ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళింది. ఇటీవల విడుదలైన గ్లింప్స్కి సంచలన స్పందన రాగా, తాజాగా విడుదలైన ఈ గీతం సినిమాపై అంచనాలను, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, ప్రతి గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సష్టించాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సామాన్య ప్రేక్షకులతో పాటు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా ఇక ఈ చిత్రానికి ఎటువంటి ప్రచారం అవసరం లేదని అంటున్నారంటే.. ‘ఓజీ’పై ఏ స్థాయి అంచనాలు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి తారాగణం ఇందులో నటించారు. ఈ సినిమా ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది’ అని తెలిపింది.