Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల అభిమానం పొందుతున్న కాటారం జీపీ కార్యదర్శి

ప్రజల అభిమానం పొందుతున్న కాటారం జీపీ కార్యదర్శి

- Advertisement -

రోడ్డుపై గుంతలు పూడ్చివేత  కృతజ్ఞతలు తెల్పిన ప్రయాణికులు, ప్రజలు
నవతెలంగాణ – కాటారం

కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద కొన్ని నెలలుగా ప్రమాదకరంగా మారిన భారీ గుంతలు  స్థానిక ప్రజలను, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ గుంతలు కారణంగా రోజూ వందలాది వాహనాలు ఇరుక్కుపోయే పరిస్థితి నెలకొనగా.. రాత్రి వేళల్లో ప్రమాదాలు సంభవించే అవకాశం మరింత ఎక్కువైంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామపంచాయతీ కార్యదర్శి షగీర్‌ ఖాన్ ముందడుగు వేశారు. అంబేద్కర్‌ గారేపల్లి చౌరస్తాలో ఉన్న రహదారి గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించి తక్షణమే పనులు పూర్తిచేశారు. స్థానికులు, ప్రయాణికులు ఈ చర్యపై సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -