Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మధ్యాహ్న భోజన కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలి..

మధ్యాహ్న భోజన కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలి..

- Advertisement -

నవతెలంగాణ –  ఆర్మూర్
మండల ప్రజా పరిషత్ ఆవరణలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల మండలాల సంయుక్త సమావేశము విజయలక్ష్మి, లలిత, స్రవంతి జిల్లా అధ్యక్షురాలు అధ్యక్షతన శనివారం నిర్వహించినారు. ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర  ఉపాధ్యక్షులు తోపునూరు చక్రపాణి మాట్లాడుతూ.. పాఠశాలలలో వంటలు చేస్తున్న మధ్యాహ్న భోజన వంట కార్మికులు అంటే ప్రభుత్వానికి, అధికారులకు చిన్నచూపు అన్నారు. అందుకే వారి సర్వీసు, సేవాభావానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా హేళనగా చూస్తున్నారు అన్నారు. వంట కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుతూ అనేక దఫాలుగా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువెళ్ళినా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

ఇప్పటికే వంటలు చేస్తున్న సందర్భంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా జరిగాయి అన్నారు. ఈ మధ్యకాలంలో మాక్లూర్ మండల అమ్రధ్ గ్రామంలో వర్ని మండలంలోని మోస్ర చందూరు  లలిత భూమవ్వ లక్ష్మి కార్మికురాలు ఇలా గంజి పడి ఒకరు, కుక్కర్ పేలి ఒకరు కూర పడి ఒకరు ఇలా అనేక మంది వంట కార్మికులకు విపరీతమైన గాయాలై నడువలేని స్థితిలో ఉన్నారని అన్నారు . ఇదంతా విధ్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందిస్తున్న సందర్భంలో జరిగినవేనని, లక్షలాది రూపాయలు వారు స్వంతంగా పెట్టుకోవలసిన పరిస్థితితులు ఉన్నాయని అన్నారు.

వీరు ప్రభుత్వంలో భాగస్వాములు కారా.. వారి ఖర్చులు ప్రభుత్వం భరించకూడదా అని ప్రశ్నించారు. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి వంట కార్మికులకు భీమా కల్పించి పరిహరాలు అందించాలని డిమాండ్ చేశారు. స్వంత డబ్బులు పెట్టి వంటలు చేస్తుంటే.. ఆ బిల్లులు నేలల తరబడి పెండింగ్లో ఉండి అప్పుల పాలవుతున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, వెంటనే పరిహరాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రంలో ఉన్న 54200 మంది వంట కార్మికులను సమీకరించి ఏఐటియుసి నాయకత్వంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో  కృష్ణ  భాయి, కవిత, లక్ష్మి, రమ్య, పోసాని ,సాయమ్మ, సత్యమ్మ ,దాసు, వసంతు, కార్మికులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -