నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని 17 గ్రామపంచాయతీలో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఒకరికి రెండు చొప్పున సోమవారం హుస్నాబాద్ లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి టీషర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు సుందరీకరంగా ఉన్నాయంటే గ్రామంలో పనిచేసే పారిశుద్ధ కార్మికుల యొక్క శ్రమ ఎంతో ఉందన్నారు. ఉదయం 6 గంటలకు లేసి గ్రామాలలో ఉడుస్తూ డ్రైనేజీలను క్లీన్ చేస్తూ గ్రామంలో ఎంతో సేవ చేస్తున్నారన్నారు.17 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు 92 టి షర్టులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏఎంసి వైస్ చైర్మన్ బంక చందు, చిత్తారి పద్మ, వల్లపూ రాజు తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు టీషర్ట్స్ పంపిణీ చేసిన గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES