- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ కమాన్ సమీపంలో రియాల్టర్ సిరిగిరి రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. రమేష్ గత 20 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన గతంలో సిరిసిల్ల కౌన్సిలర్ గా పని చేశారు. వేములవాడకు చెందిన వ్యక్తులు ఆయనను దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. హంతకులు వేములవాడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. కాగా రమేష్ ను కారు లోనే గొంతు కోసి దారుణంగా చంపారు. దళిత నాయకుడిని హత్య చేయడం జిల్లాలో సంచలనం రేపింది.
- Advertisement -