- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఆదివారం నుండి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు, దసరా పండుగ కావడంతో శనివారం ఉదయం నుండే బస్టాండ్ లలో ఒక పక్క ప్రయాణికులు, ఇంకోపక్క విద్యార్థులు తమ స్వస్థలాలకు తిరిగి వేల్లేందుకు ఎక్కువ శాతం బస్సులోనే రాకపోకలు సాగించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లా కేంద్రానికి, పట్టణానికి వచ్చే పోయే బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ప్రతి బస్సు ఫుల్ ఫుల్ గా ఉన్న ఫుట్ బోర్డు పై నిలుచుకుని ప్రయాణం చేస్తున్నారు.
- Advertisement -