నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను జిల్లా అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరెట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు తో కలిసి ప్రజవాణి లో పాల్గొని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నా వాటిపై దృష్టి సారించి తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
నేడు నిర్వహించిన ప్రజవాణి లో భూములకు సంబంధించి 23 ఫిర్యాదులు, డి పి ఓ కి 7,మున్సిపల్ కమిషనర్ లకి 5,ఎంప్లాయిమెంట్ అధికారికి 5,ఎంపీడీవోలకు 4 , ఇతర అధికారులకు 17 ఫిర్యాదులు ,మొత్తం 61 ఫిర్యాదులు వచ్చాయని వీటన్నింటిని సంబంధిత శాఖల అధికారులకు పంపడం జరిగిందని, జాగ్రత్తగా అన్నిటిని పరిశీలించి ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించెందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఆర్డీఓ వేణుమాధవ్,డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్, డి సి ఓ పద్మ,సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస్, నరసింహారావు , పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి,సూపర్టీడెంట్లు,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.