- Advertisement -
– కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ ఇన్స్పెక్టర్
నవతెలంగాణ – కామారెడ్డి
ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ లో మద్యం సేవించి దొరికిన 29 మందిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా నలుగురికి ఒకరోజు చొప్పున జైలు శిక్ష మిగతా వారికి జరిమానా విధించడం జరిగిందని కామారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ నరహరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహన నడిపే ఏమి జరుగుతుందో వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇక ముందు ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ రూల్స్ ని ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు సూచించారు.
- Advertisement -