- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మజ్లిస్ సన్నద్ధమవుతుంది.ఈ నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు బిహార్లోని కిషన్గంజ్ నుంచి ‘సీమాంచల్ న్యాయ యాత్ర’ పేరుతో ప్రచారాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించనున్నారు. అదే విధంగా గత శాసనసభ(2020)ఎన్నికల్లో 25 స్థానాలకు పోటీ చేసి 5 స్థానాల్లో విజయం సాధించిన మజ్లిస్ ఈసారి అదనంగా మరో పది స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించాలని చూస్తోంది. బిహార్లో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన సీమాంచల్లో నివసిస్తున్న ముస్లిం మైనారిటీల ఓట్లతో విజయం సాధించవచ్చనే ధీమాతో మజ్లిస్ ఆ ప్రాంతంలోని నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను పోటీలో దించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
- Advertisement -