డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ను జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్రావు కొండ్రోల్లా కొలాబరేషన్లో పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 28న ఈ సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 28న అనౌన్స్ చేయబోయే టైటిల్ అందర్నీ సర్ప్రైజ్ చేస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ట్రూ పాన్-ఇండియా ఎంటర్టైనర్గా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి.