విభిన్న పాత్రలతో అలరి స్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్లో మరో అడుగు ముందుకు వేశారు. నిర్మాతగా, దర్శకురాలిగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. తన సోదరి పూజా శరత్ కుమార్తో కలిసి దోస డైరీస్ బ్యానర్ని ప్రారంభించారు. ఈ బ్యానర్ పై తొలి చిత్రంగా ‘సరస్వతి’ టైటిల్తో ఆసక్తికరమైన థ్రిల్లర్ను శనివారం అనౌన్స్ చేశారు.
సరస్వతి టైటిల్లో ‘ఐ’ అనే అక్షరం ఎరుపు రంగులో హైలైట్ చేయబడి, సినిమా ఇంటన్సిటీని ప్రజెంట్ చేస్తోంది. టైటిల్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం – తమన్, డిఓపీ – ఎ.ఎం.ఎడ్విన్ సకే, ఎడిటర్ – వెంకట్ రాజేన్, ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- ప్రవీణ్ డేనియల్.
వరలక్ష్మి శరత్ కుమార్లో దర్శకత్వంలో ‘సరస్వతి’
- Advertisement -
- Advertisement -