- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
త్వరలో జరగనున్న ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ వెరిఫికేషన్ ను సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు మాట్లాడుతూ.. ఎంపిటిసి ఎన్నికలలో భాగంగా రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ల సందర్భంగా అందజేసే మెటీరియల్ను వెరిఫికేషన్ చేసి మండలంలోని నాలుగు క్లస్టర్లకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపిఓ పాండు, పంచాయతీ కార్యదర్శులు తిరునగిరి శ్రీధర్ తో పాటు ఆయా గ్రామా పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -