- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిగా డాక్టర్ కె.లలితాదేవి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ బి.రవీందర్ నాయక్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె వికారాబాద్ ఇన్ఛార్జి డీఎంహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. లలితాదేవిని రంగారెడ్డి డీఎంహెచ్ఓగా నియమిం చడంతో, వికారాబాద్ డీఎంహెచ్ఓగా ప్రస్తుతం బషీరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న డాక్టర వై.పవిత్రను నియమించారు.
- Advertisement -