Monday, October 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరేపే ‘నోబెల్’ అవార్డుల ప్ర‌క‌ట‌న‌..

రేపే ‘నోబెల్’ అవార్డుల ప్ర‌క‌ట‌న‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులు అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రకటించనున్నారు. మొత్తం ఆరు రంగాల్లో ర‌సాయ‌న‌, భౌతిక‌, సాహిత్యం, శాంతి, ఆర్థిక‌శాస్త్రం, మెడిసిన్ విభాగంలో అత్యుత్త‌మ సేవ‌లు అందించిన వారికి ఈ అవార్డును ప్ర‌క‌టించ‌నున్నారు. విజేతల పేర్లను వాలెన్‌బర్గ్‌సాలెన్‌లోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లో నోబెల్ అసెంబ్లీ ప్రకటిస్తుంది. తర్వాత భౌతిక శాస్త్రం నుంచి విజేతలను స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటిస్తుంది. సాహిత్యంలో నోబెల్ బహుమతిని అక్టోబర్ 9న స్టాక్‌హోమ్ నుంచే ప్రకటించనున్నారు. తరువాత 10వ తేదీన నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు.

ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం తరువాత ఈ నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు.ప్రతి ఏడాది డిసెంబర్ 10న నోబెల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి. ఈ రోజున నోబెల్ బహుమతులు గ్రహీతలకు ప్రదానం చేస్తారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లువురు భార‌త్‌కు చెందిన ప్ర‌ముఖులు నోబెల్ పుర‌స్కారాన్ని పొందారు. 1913లో సాహిత్యంలో ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్‌, సీవీ. రామ‌న్(భౌతిక‌శాస్త్రం-1930), మ‌థ‌ర్ థెరిస్సా(శాంతి-1979), అమ‌ర్త్య సేన‌(అర్థిక శాస్తం-1998), కైలాస్ స‌త్యనాథ్‌(శాంతి-2014) త‌దిత‌రులు ఈ అవార్డును స్వీక‌రించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -