- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: వాహన కాలుష్యం (PUC) క్లియరెన్స్ సర్టిఫికేట్ ల చార్జీలను కర్నాటక ప్రభుత్వం పెంచింది. ద్విచక్రవాహనాలకు రూ.65నుంచి రూ.80కి, ఆటో రిక్షాలకు రూ.75 నుంచి 80కి పెంచింది. అదే విధంగా పెట్రోల్, LPG -CNGలతో నడిచే వాహనాల కాలుష్యం తనిఖీల చార్జీలను కూడా పెంచారు. రూ.115 నుంచి 150గా నిర్ణయించారు. డీజిల్ వాహనాలకు రూ.160 నుంచి 200కు పెంచారు. రాష్ట్రంలో క్రమం తప్పకుండా వాహనాల పొల్యూషన్ సర్టిఫికేట్ ల తనిఖీలు ఉంటాయని, పీయూసీ సర్టిఫికేట్ను చూపించడంలో విఫలమైతే మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం జరిమానా విధిస్తామని అధికారులు తెలియజేశారు.
- Advertisement -



