- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సూచీలను మద్దతుగా నిలిపాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ట్రెంట్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ షేర్లు ప్రధానంగా నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 81,926.75 వద్ద 136.63 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ 25,108.30 వద్ద 30.65 పాయింట్ల లాభంలో స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 88.78 వద్ద ఉంది.
- Advertisement -