Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ శర్మ

ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ శర్మ

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
మంగళవారం కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎంపిటిసి, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూములు భద్రత, సీసీ కెమెరా, పోలీస్ బందోబస్తు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై ఆయన ఆరా తీశారు. ఎన్నికల సమయంలో ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, లెక్కింపు రూముల్లో విద్యుత్, లైటింగ్, భద్రత వంటి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపిడివోలు అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సౌకర్యాలు కల్పనపై ధ్రువీకరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. దివ్యాన్గులకు ర్యాంపు, మూడు చక్రాల సైకిళ్ళు అందుబాటులో ఉంచేలా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎంపిడిఓ బాబు, తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -