- Advertisement -
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత్, పాకిస్తాన్ మధ్య తక్షణమే అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ప్రకటన సానుకూలంగా ఉందనీ, దీన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ స్వాగతిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు దేశాల ప్రజలు శాంతి కోసం చేసిన కృషిని అభినందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ తన సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేయాలని కోరారు. ఇక నుంచి ఎటువంటి ఘర్షణలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -