Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షునిగా సుందర్

తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షునిగా సుందర్

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌  జిల్లా ఎన్నికలు బుధవారం పట్టణంలో  శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా శ్రీ పొలపల్లి సుందర్‌ (శ్రీ భాషిత స్కూల్‌, ఆర్మూర్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆర్కిడ్ స్కూల్‌ నిజామాబాద్‌ ప్రతినిధి శ్రీ క్రాంతి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర కోశాధికారి శ్రీ రాఘవేందర్‌ రెడ్డి ఎన్నికల అధికారి‌గా పర్యవేక్షించారు. నిర్మల్‌ జిల్లా  అధ్యక్షుడు శ్రీ వేదం శ్రీనివాస్‌ రెడ్డి ఈ ఎన్నికలకు పరిశీలకుడిగా హాజరయ్యారు.

జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొని నూతన నాయకులకు అభినందనలు తెలిపారు. సుందర్‌, కాంతి నాయకత్వంలో   జిల్లా ప్రైవేట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించి, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తుందని సభ్యులు  తెలిపారు. సభ్యులందరూ ఏకతా, అభివృద్ధి దిశగా కట్టుబడి పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు ,ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -