- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో నేడు తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. బలహీనమైన జీవో నం.9తో సీఎం రేవంత్ బీసీలను మోసం చేశారని, దానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్టేపై సీఎం ఎలా స్పందిస్తారో చూసి రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిస్తామని నిన్న ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.
- Advertisement -