- Advertisement -
నవతెలంగాణ- కాటారం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధన ధాన్య కృషి యోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ శనివారం ఉదయం 10:30కు ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల-సమ్మయ్య, ఏఎంసీ డైరెక్టర్ పిల్లమారి రమేష్ , కాటారం రైతులు పాల్గొనడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద అధునాతన పంటలను రైతులు పండించాలని వ్యవసాయ పశు సంవర్ధక, మత్స్య పంటలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అధిక లాభాలు రైతులు పొందగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి కార్యదర్శి ఎండి ల షరీఫ్, రైతులు పాల్గొనడం జరిగింది.
- Advertisement -