- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా అవగాహన కార్యక్రమం ఈనెల 14న ఉదయం 10.30 గంటలకు వాసు హై స్కూల్ (వెంకటేశ్వర కాలనీ, దుబ్బ ) లో నిర్వహిస్తున్నట్లు చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ కోయేడి నర్సింలు గౌడ్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా బాస రాజేశ్వర్ సీనియర్ అడ్వకేట్, మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు హాజరవుతున్నట్లు తెలిపారు.
- Advertisement -