నవతెలంగాణ – హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ విధానంపై మాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తీవ్ర నిరసనకు సిద్ధమైంది. ఈ విధానం వల్ల తమ సామాజికవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఏకంగా 300 మందితో నామినేషన్లు వేయించనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తమ ఆవేదనను ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడారు. గత ఐదు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎస్సీ వర్గీకరణ విధానం వల్ల గ్రూప్-3లోని 25 మాల కులాలకు విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల అధ్యక్షులకు వినతి పత్రాలు ఇచ్చినా ఎవరూ స్పందించలేదని ఆయన విమర్శించారు.
జూబ్లీహిల్స్ లో 300 నామినేషన్లు వేస్తాం: జేఏసీ
- Advertisement -
- Advertisement -