ఆడుకుంటూ పామును కొరికి చంపిన బాలుడు

నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్
ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు అక్కడ కనిపించిన పామును చేత్తో పట్టుకుని నోటితో కొరికి చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్‌కు చెందిన దినేశ్‌సింగ్ మూడేళ్ల కుమారుడు శనివారం ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ఓ పాము అతడి వైపుగా వచ్చింది. దానిని ఒడుపుగా పట్టుకున్న బాలుడు నోట్లో పెట్టుకుని కొరికి చంపేశాడు. ఆ తర్వాత స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంట చనిపోయిన పామును కూడా పట్టుకెళ్లారు. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

Spread the love