– ప్రశ్నించే తత్వానికి ప్రతీక మానుకోట
– టియుడబ్ల్యుజే (ఐజేయు) ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ
నవతెలంగాణ-మరిపెడ
నైజాం పాలకుల అక్రమాలు, నిరంకుశత్వాన్ని ఎదిరించేందుకు ప్రజల్లో చైత న్య స్ఫూర్తిని రగిలించిన కవి దాశరధి, పత్రికా రచయిత షోయబుల్లా ఖాన్ మాను కోట ప్రాంత వాసులు కావడం, వారి అడుగుజాడల్లోనే ఈ ప్రాంత జర్నలిస్టులు ప్రశ్నించే తత్వాన్ని పునికి పుచ్చుకొని వారికి ప్రతీకగా నిలుస్తున్నారని టియుడబ్ల్యు జే (ఐజేయు) ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ కేంద్రంలో శనివారం మరిపెడ టియుడబ్ల్యూజే (ఐజేయు) కమిటీ ఆధ్వ ర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ ప్రతినిధు లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావే శంలో విరాహత్ అలీ మాట్లాడుతూ ప్రజా చైతన్య స్ఫూర్తిదాతలైన దాశరధి, షో యబుల్లా ఖాన్ పుట్టిన మట్టి వాసనతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మా నుకోట ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. టియుడబ్ల్యూజే (ఐజేయు) జర్న లిస్టుల హక్కులు, సంక్షేమం కోసం 65 ఏళ్లుగా పోరాడుతూనే, మీడియా స్వేచ్ఛ ను కాపాడేందుకు అవిశ్రాంతంగా కషి చేస్తోందని చెప్పారు. మీడియాలో కార్పొ రేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో స్వేచ్ఛగా జర్నలిస్టులు చివరకు ఎడిటర్ల కూ డా స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. యాజమాన్యం చేప్పిన విధంగానే వార్తలు రాయాల్సి వస్తోందని, ఎడిటోరియల్కు బదులుగా ప్రొప్రోయిటల్గా మారిపోయా యన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా పేరుతో అధికంగా మీడియాలో పెడదో రణి పెరిగిపోయిందని, న్యూసెన్స్ మీడియాగా మారిందని, జర్నలిజం పవిత్రతను కాపాడేందుకు చర్చ జరగాలన్నారు. పెడ దోరణికి వ్యతిరేకంగా జర్నలిస్టులు సం ఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన జర్నలిస్టుల సంక్షేమానికి, జర్నలిస్టుల ఆకాంక్షలను నెరవేర్చ డానికి ప్రభుత్వం ఆశించిన రీతిలో చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మం డల స్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులందరిని బిపిఎల్ గా గు ర్తించి ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకో వాలని విరాహత్ అలీ విజ్ఞప్తి చేశారు. జాతీయ కౌన్సిల్ సభ్యుడు దాసరి కష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మండల స్థాయి జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో పా టు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించిన ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీయూడబ్ల్యూజే నన్నారు. వత్తిలో నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నందుకు, సామాజిక స్పహ, న్యాయ సంబంధమైన అంశాలపై అవ గాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించామని చెప్పారు. ప్రస్తుతం రా ష్ట్రంలో జర్నలిస్టులకు తగిన గుర్తింపు లేదని, కనీసం రాష్ట్ర సచివాలయంలోకి వె ళ్లేందుకు కూడా జర్నలిస్టులకు అనుమతి లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చే శారు. జర్నలిస్టులకు హక్కుల కల్పన నామ మాత్రంగా మారిందని, జర్నలిస్టుల హ క్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆరోపించారు. సంఘటితం గా ముందుకు సాగుతూ జర్నలిజాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ మాట్లాడుతూ మహబూ బాబాద్ జిల్లాలో జర్నలిస్టులకు గహలక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరు చేయడం తో పాటు ఇంటి స్థలం కేటాయింపుకు కషి చేస్తామని చెప్పారు. మరిపెడ మున్సి పాలిటీలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలు, ఇబ్బందు లను పరిష్కరించడంలో జర్నలిస్టులను ప్రజలు దేవుళ్ల కంటే ఎక్కువగా నమ్ముతా రని చెప్పారు. సమాజ మార్పు కోసం జర్నలిస్టులు చేస్తున్న కషి మరువలేనిద న్నారు. ఈ సందర్భంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, వత్తి నైపుణ్యం ఎందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని, జర్నలిస్టు బంధు పథ కం అమలు చేయాలని, ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయించి భవనాన్ని నిర్మిం చాలని జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా హర్ష ద్వానా లతో ప్రతినిధులు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ పరివార్ అధినేత నానావత్ భూపాల్ గౌడ్, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు దూలం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బండి సంపత్ కుమార్, గుంటి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు షోయబుల్లాఖాన్ చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఇటీవల దివంగతులైన జిల్లాకు చెందిన పలువురు జర్నలిస్టులు మరణించగా వారి ఆత్మ శాంతికి మౌనం పాటించారు. జి ల్లా కార్యదర్శి వర్గం, మరిపెడ మండల కమిటీ నాయకులు సభ్యులు పాల్గొన్నారు.