నవతెలంగాణ-కొనరావుపేట : ఆరుగాలు శ్రమించే రైతన్నకు అన్ని కష్టాలే పంట పొలంలో దున్నడానికి వెళ్లిన ఓ రైతు పాము కాటు గురైన సంఘటన మండలంలోని వెంకట్రావు పట గ్రామంలో చోటుచేసుకుంది గ్రామానికి చెందిన మంథని శంకర్ అనే రైతు తన పంట కులానికి వెళ్ళాడు అక్కడ పాము కాటుకు గురయ్యాడు. వెంటనే స్థానికులు చూసి ఆయనను కరీంనగర్ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు.