నూతన ప్రధానోపాధ్యాయులకు ఘన సన్మానం 

నవతెలంగాణ-బెజ్జంకి :
మండల కేంద్రంలోని బాలికలు, బాలురు, కేజీవీబీ, గాగీల్లపూర్, రేగులపల్లి, కల్లేపల్లి, దాచారం, తోటపల్లి ప్రభుత్వోన్నత పాఠశాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, కృష్ణ కుమారి, శ్వేత, పవన్ సింగ్, భారతి, మహతి లక్ష్మి, రేవతిలను మంగళవారం మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో ఎస్టీయూ, యూటీఎఫ్, డీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులు, ఎంఈఓ పావని కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం అందుకున్న రజనీశ్ రెడ్డిని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. మండలంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటామని నూతన ప్రధానోపాధ్యాయులు తెలిపినట్టు ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్ తెలిపారు.
Spread the love